Ads 468x60px

gghgh

Featured Posts

Photo Slide

About TELANGANA


Telangana region is part of Andhra Pradesh state in southern India. It constitutes Hyderabad, Adilabad, Karimnagar, Khammam, Mahaboobnagar, Medak, Nalgonda, Nizamabad, RangaReddy and Warangal districts. Telangana region is one of the least developed regions in India. Rampant poverty, illiteracy, malnourished children, child labor, farmer suicides, unemployment, water scarcity and electricity shortage are some of the problems of this region. There are millions of people who are not fortunate enough to send their children to schools or feed their children three time a day, or provide safe drinking water to their families in this area.

Monday, December 10, 2012

పాలమూరులో కురుమూర్తి క్షేత్రం మన ఏడుకొండలవాడు





తెలంగాణలో జరిగే అతిపెద్ద తిరునాళ్ళలో కురుమూర్తి జాతర ఒకటి. ఇక్కడ నవంబర్ 13న అమావాస్య రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అవి డిసెంబర్ 13న అమావాస్యతో ముగుస్తున్నయి. ఈ సందర్భంగా ‘ఆనందగిరి ఏడుకొండల’పై వెలిసిన వేంక స్వామిపై ‘బతుకమ్మ’ ప్రత్యేక కథనం.

స్థల పురాణం
ప్రకృతి శోభతో అలరారే కురుమూర్తి గిరులపై వెలసింది సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేషుని ప్రతిరూపమేనని స్థల పురాణం పేర్కొంటున్నది. ఇక్కడ అరుదైన పుష్ప, పక్షి జాతులు కూడా ఉన్నయి. నేటికీ ఈ పరిసరాలు జీవ వైవిధ్యంతో పచ్చదనాన్ని పులుముకుని కళకళలాడుతూ ఉంటయి.
ఇక్కడి గిరుల వర్ణన ప్రాచీన సాహిత్యంలో విశేషంగా కనిపిస్తుందని స్థానిక పండితులు చెబుతరు. బుక్కపట్టణం బుచ్చి వెంకటాచార్యులు రాసిన ‘శ్రీ ఉత్తర వెంకటాచల మహత్యం’ నకీ.శ. 1854-61) గ్రంథంలో కురుమూర్తి గిరుల శోభ ప్రస్తావన ఉన్నట్టు చెబుతరు.

అజకొల్లు శేషకవి ‘శ్రీ కురుమూర్తి క్షేత్రస్థల పురాణం’ (1850)లో మొత్తం 107 పద్యాలు ఉన్నయి. 1851-1905 మధ్య కాలంలో కురుమూర్తి స్వామి సుప్రభాతాలు ప్రసిద్ధినొందాయి. వీటిని శ్రీనివాస విలాస గ్రంథకర్త కృష్ణమాచార్యులు రచించారు. కాగా, స్థానిక కవి పండితులు వైద్యమ్ వెంక 1983లో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ‘శ్రీకురుమూర్తి క్షేత్ర చరివూత’ రాయడమేకాక 2005లో సంస్కృత గ్రంథమైన శ్రీఉత్తర వేంకటాచల మహత్మ్యం’ను తెలుగులోకి అనువదించారు.
 వీటితోపాటు 1959లో వి.రామకృష్ణయ్య ముద్రించిన శ్రీకుర్మూర్తిస్వామి భజన కీర్తనలు, విశ్రాంత ఉపాధ్యాయుడు బెల్లం సాయిలు ఇటీవలి కాలంలో ప్రచురించిన కురుమూర్తిస్వామి భజన కీర్తనలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. చరిత్ర, సాహిత్య పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి ఈ క్షేత్రం వివరాలను ఎన్నింటినో సేకరించి పరిశోధకులకు అందించారు. స్వామిని కీర్తించే అనేక జానపద గేయాలను వనపర్తికి చెందిన ఉమ్మెత్తల నర్సింహమూర్తి సేకరించారు. మరోవైపు పలువురు విద్యార్థులు ఈ క్షేత్రంపై పరిశోధనలూ సల్పుతున్నరు.

స్వామి ‘ప్రతిరూపాలు’ వెలసిన పవిత్ర క్షేత్రం
ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెండ్లాడేందుకు కుబేరుని వద్ద అప్పు చేసి, దానిని తీర్చడంలో మాట తప్పానని మనస్థాపం చెందాడు మహావిష్ణువు. స్వామి కృష్ణానదీ తీరం వెంట వెళ్తూ జూరాల వద్ద గల గుండాల జలపాతం వద్ద స్నానం చేశాడు. అక్కడ్నించి ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవి కోరిక ఆయనకు గుర్తొచ్చిందిట. ఆ మేరకు అక్కడి ‘కురుమూర్తి గిరుల’పై విశ్రమించాడు. అక్కడ్నించి తిరిగి వెళ్ళేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళారని స్థల పురాణం వివరిస్తోంది. అదే ‘కురుమార్తి స్వామి’ క్షేత్రమైంది.

‘కురుమూర్తి స్వామి’ క్షేత్రానికి సంబంధించి ‘దుర్వాస, దిలీప సంవాదం’ అనే కథతో పాటు జానపదులు చెప్పుకొనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దాని ప్రకారం తిరుపతి ఏడుకొండల స్వామి క్షేత్రానికి, ఈ దేవస్థానానికి మధ్య విశేషమైన పోలికలు కనిపిస్తయి.

చారివూతక నేపధ్యం -దశాబ్దాల చరిత్ర 
కాకతీయుల సామంతుడిగా, రాజవూపతినిధిగా బాధ్యతలు నిర్వహించిన గోన గన్నాడ్డి కుటుంబ సమేతంగా తిరుపతి యాత్రకు వెళ్లాట్ట. ఆ సమయంలో ఇక్కడికి సమీపంలోని చంద్రగిరి ప్రాంతంలోని ముక్కెర వంశస్థుడైన గోపాలడ్డిని కలిశారు. ఆయన గుణగణాలను, ధైర్య సాహసాలను, ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్దుడై, వర్థమానాపురం (వడ్డేమాన్) పరగణాకు తనను ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన గోపాలడ్డికి ‘మక్తలనాడ గౌడ’ పదవిని అప్పగించాడు.

అలా ముక్కెర వంశానికి చెందిన గోపాల్‌డ్డి మొదలుకొని నకీ.శ. 1268) సంస్థానాలు విలీనమయ్యే నాటికి అధికారంలో ఉన్న భాగ్యలక్ష్మీ దేవి (1948) దాకా మొత్తం 28 తరాల వారు అందరూ తమ ఇలవేల్పు అయిన ఇక్కడి ‘కురుమూర్తి స్వామి’ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నది చారివూతిక సమాచారం.

రమణీయమైన ప్రకృతి శోభ నడుమ, కొండగుహల మధ్య వెలసిన కురుమూర్తి స్వామి వారికి క్రీ.శ.1350లో అప్పటి సంస్థాన బాధ్యతలు నిర్వహించిన చంద్రాడ్డి ఆలయం నిర్మించాడని తెలుస్తోంది. అనంతరం ఇదే వంశానికి చెందిన మిగిలిన రాజ వంశీయులు కొండకు మెట్లు, మండపాలు, కొండ కింద కోనేరు నిర్మాణాలకు పూనుకొన్నారని చారివూతక ఆధారాలు స్పష్టం చేస్తున్నయి. రాజా సీతారామభూపాల్, రాజా శ్రీరామభూపాల్‌లతోపాటు ఆత్మకూరు సంస్థానాన్ని చివరగా పాలించిన భాగ్యలక్ష్మీ దేవిలు కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధి కోసం విశేష కృషి సలిపారు. స్వామి వారికి ‘వార్షిక బ్రహ్మోత్సవాల’ను ఘనంగా నిర్వహించడంలోనూ వారు ప్రధాన భూమికను పోషించారు.
ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయం 1810-1840ల మధ్య కాలంలో నిర్మితమైనట్టు భావిస్తున్నరు. 1878లో ఉద్దాల మండపాన్ని నిర్మించగా, నగారా బంగ్లా (నవత్ ఖానబంగ్ల) వాద్యకారుల కోసం 1857-78 మధ్య కాలంలో నిర్మితమైనట్టు చెబుతున్నరు. సీతారామభూపాలుడే ఉత్సవాల సందర్భంగా దీనిని ఉపయోగించేవారని తెలుస్తోంది. ఇక, విశాలమైన ధర్మశాలను, ప్రాచీనమైన మెట్లను అదే కాలంలో నిర్మించినట్లు చరిత్ర ఉంది.

ముక్కెర వంశస్థుల ఆభరణాలు
అమరచింత (అమ్మాపూర్) సంస్థానాధీశుల ఇలవేల్పు అయిన కురుమూర్తి స్వామికి ముక్కెర వంశస్థులైన రాజా సోంభూపాల్ 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు. శంఖుచక్షికాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు ఈ స్వామి వారికి బహుకరించారు. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

మొదట్లో ఆభరణాల భద్రత దృష్ట్యా వాటిని సంస్థానాధీశుల బంగ్లాలోనే ఉంచేవారు. ఉత్సవాల సందర్భంగా రాజభవనం ముందున్న కొలనులో ఆభరణాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు జరిపేవారు. అనంతరం కొండపైకి వాటిని వేడుకగా తీసుకు వెళ్ళి స్వామివారికి అలంకరించేవారు.
1968లో కురుమూర్తి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖలో విలీనమైంది. ఫలితంగా 1976 నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తున్నరు. ఉత్సవాల సందర్భంగా వాటిని తెచ్చి స్వామి వారికి అలంకరిస్తున్నరు. ముక్కెర వంశస్థులే నేటికీ ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన భూమికను పోషిస్తున్నరు.

దినదినాభివృద్ధి
మహిమాన్విత క్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి మూలవిరాట్టు మొదట్లో సహజ సిద్ధమైన గుహలలో పెద్ద రాతిగుండు కింద ఉండేది. భక్తులు గుహ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొనేవారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో గర్భగుడికి గోపురం నిర్మించారు. దానిముందు మండప నిర్మాణం, ధ్వజ స్తంభం ఏర్పాటు చేశారు.

అమరచింత నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ్యులు, ప్రజావూపతినిధులు, ఆలయ ధర్మకర్తల మండలితో పాటు దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థాలు, పలు అభివృద్ధి కార్యక్షికమాలను నిరంతరం అమలు జరుపుతున్నరు. స్వామి భక్తుడైన రాయిచూరు కుర్మిడ్డి ఆలయ అభివృద్ధి పనుల కోసం నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రస్తుతం శాశ్వత అన్నదాన సత్రాన్ని నిర్మిస్తుండడం ఓ ప్రత్యేకత.

అమావాస్య రోజు అన్నదానం
కురుమూర్తిని సందర్శించుకునే భక్తుల సౌకర్యార్థం కొండ కింద శాశ్వత షెడ్లు నిర్మించారు. విశ్రాంతి గృహం, కళ్యాణ కట్ట, మంచినీటి సౌకర్యం కోసం కొండ కింద, పైన వాటర్ ట్యాంకులను నిర్మించారు. కేవలం ఉత్సవాల సందర్భంగానే కాకుండా ప్రతి అమావాస్యకు భక్తులు స్వామిని దర్శించుకుంటరు.

ప్రతి అమావాస్యకు 15 నుండి 20 వేల మంది వరకు భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తారని అంచనా. ఈ సందర్భంగా కొందరు దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో ‘అన్నదాన కార్యక్షికమాని’కి శ్రీకారం చుట్టారు. అప్పంపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బెల్లం సాయిలు 1994లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్షికమం చేపట్టారు. మొదట్లో 40 నుండి 50 మంది వరకు మాత్రమే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేవారు. కానీ, ప్రస్తుతం ప్రతి అమావాస్యకు వేల సంఖ్యలో అన్నదానాన్ని స్వీకరిస్తున్నరు.

1991లో కీ.శే. పాలెం సౌరప్ప తన శిష్యబృందంతో ప్రతి అమావాస్యకు ఇక్కడకు వచ్చేవారు. ఆయన రాత్రి ఇక్కడే బస చేసి, భజనలు చేసి తిరిగి వెళ్లేవారు. అనంతర కాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాతలు కూడా ముందుకు వచ్చి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. ప్రత్యేక ధార్మిక కార్యక్షికమాలు, భజనలు నిరంతరంగా ప్రతి అమావాస్యకు జరుగుతున్నయి.

బండెనుక బండి...
బ్రహ్మోత్సవాలలో భాగంగా కార్తీక శుద్ధ సప్తమి నాడు జరిగే ‘ఉద్దాల ఉత్సవం’లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తరు. జాతరను తిలకించడానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుండి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలతో పాటు స్వంత వాహనాలలో వస్తరు. ఇప్పటికీ ఎడ్లబండ్లు విశేషంగా ఇక్కడ కనిపిస్తయి. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలను తమ ఇళ్ళకు ఆహ్వానించి తల్లిదంవూడులు కురుమూర్తి జాతరకు తీసుకు సంతృప్తి పరుస్తరు. భక్తి పారవశ్యంతోపాటు కుటుంబ సభ్యులు, బంధుమివూతుల ఆత్మీయ సమ్మేళనానికి కురుమూర్తి జాతర ఒక ఆహ్లాదకరమైన వేదికగా నిలవడం విశేషం.
పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యం గల పుణ్యక్షేవూతాలు తెలంగాణలోనూ ఉన్నాయనడానికి మహబూబ్‌నగర్ జిల్లాలోని కురుమూర్తి క్షేత్రమే ఒక ఉదాహరణ. తిరుమల తిరుపతి శ్రీవేంక పోలిన ప్రత్యేకతలు ఇక్కడా ఉండడం విశేషం.

- తిరుమలలోని ఏడుకొండలపై వెలసిన శ్రీవేంక స్వామికి ‘అలిపిరి మండపం’ ఉండగా ఇక్కడ కురుమూర్తి శ్రీవేంక స్వామి వారికి ‘ఉద్దాల మండపం’ ఉంది.

- తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ‘మోకాళ్ళ గుండు’ పేర్న ఎత్తయిన కొండ ప్రాంతాన్ని పోలిన ప్రదేశం ఉంటుంది. ఇక్కడా అలాంటిదే ఉంది.

- తిరుమలలోనూ, కురుమూర్తిలోనూ ‘పాద చిహ్నాలు’ ఉండటం మరో విశేషం. తిరుమలలో శ్రీవారు నిలుచున్న భంగిమలోనే భక్తులకు దర్శన మిస్తడు. ఇక్కడ కూడా అదే విధమైన భంగిమలో స్వామి సాక్షాత్కారం లభిస్తుంది.

- తిరుపతిలో ‘ఏడు కొండల’పై స్వామి వెలిశాడు. కురుమూర్తిలోనూ చిత్రంగా ‘ఏడు కొండలు’ ఉండటం మరో అనూహ్యం. ఇక్కడి ఏడుకొండల ప్రస్తావన 1878లో నరసింహ దీక్షితులు రచించిన చెంచుకథలో ఉంది. తిరుమల గుట్టలను పోలిన ఏడు గట్టుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: శ్వేతాద్రి- బొల్లిగట్టు, ఏకాద్రి- ఒంటిగట్టు, దుర్గాద్రి- కోటగట్టు, ఘనాద్రి- పెద్దగట్టు, భల్లూకాద్రి- ఎల్గులగట్టు, పతగాద్రి- చీపర్లగట్టు, దైవతాద్రి- దేవునిగట్టు.

- దేవునిగట్టుపైనే కురుమూర్తి స్వామి కొలువై ఉన్నడు. జానపదులు ఈ క్షేత్రాన్ని కురుమతి, కురుమూర్తి, కుర్మతి, కుర్మూర్తి అని పిలుస్తరు. ఇక్కడి స్వామిని కురుమన్న స్వామిగా, కురుమతిరాయుడిగా కొలుస్తరు.

- సాధారణంగా ప్రతి ఆలయంలోనూ గణపతి విగ్రహం తప్పక ఉంటుంది. కానీ, తిరుపతి, కురుమూర్తి ఆలయ ప్రాంగణాలలో మాత్రం ఆ విఘ్ననాయకుడు మనకు కనిపించడు. ఈ రెండు క్షేత్రాల పోలికల నేపథ్యంలో ‘తిరుపతిలోని ఆనందగిరి శిఖరం’లోని కొంత భాగమే ‘కురుమూర్తిగిరి’ అని స్థల పురాణం వివరిస్తోంది.

- మరో విషయం, కురుమూర్తి గుట్టపై స్వామి వారి దర్శనానికి వెళ్లేదారిలో ఉన్న చెన్నరాయుడి గుడి కూడా అతి ప్రాచీనమైందిగా చెప్తారు. క్రీ.శ.1350లోనే దీనిని నిర్మించి ఉంటారని కొందరు పరిశోధకులు భావిస్తున్నరు.

ఎలా వెళ్ళాలి?
ఈ క్షేత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపురం గ్రామానికి చేరువలో వుంది. సికింవూదాబాద్ నుండి గుంతకల్లు వెళ్ళే రైలు మార్గంలో ‘కురుమూర్తి’ రైల్వేస్టేషన్‌లో దిగి భక్తులు కురుమూర్తి ఆలయానికి చేరుకోవచ్చు. కురుమూర్తి రైల్వేస్టేషన్ నుండి దక్షిణం వైపు 6 కి.మీ. దూరంలో ఆ ఆలయం ఉంటుంది. ఆర్టీసీ బస్సులలో మహబూబ్‌నగర్ నుండి లేదా జాతీయ రహదారి కొత్తకోట నుండి మదనాపురం మీదుగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. అమావాస్య, బ్రహ్మోత్సవాల సందర్భంలో మాత్రం ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతుంది.

స్వామిసేవలో వివిధ వృత్తుల వాళ్లు
కన్నుల పండువగా జరిగే ‘కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవం’ అనేక ప్రత్యేకతలతో కూడుకొని ఉంటుంది. స్వామివారి ఉత్సవాల ఏర్పాట్లలో వివిధ వృత్తుల వారు భక్తితో పాలుపంచుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. దీన్ని నేటికీ నిర్వాహకులు అనుసరిస్తున్నరు. స్వామివారి సేవలో తమకు లభించిన అపూర్వ అవకాశంగా వివిధ వృత్తుల వారు భావిస్తరు. దైవసన్నిధిలోని ‘భిన్నత్వంలో ఏకత్వానికి’ ఇది నిదర్శనం.

మేదరుల పాత్ర
ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను తీసుకు వడ్డేమాన్‌కు చెందిన మేదరులు ప్రత్యేక చాటను తయారు చేస్తరు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభిస్తరు. ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తరు. దాంతో స్వామికి దళితుల సేవకు శ్రీకారం పడుతుంది.

దళితుల సేవ
అమావాస్య రోజు వడ్డేమాన్ ఉద్దాల కర్మాగారంలో ఇసుకపై కనిపించే పాదాల గుర్తుల ఆధారంగా స్వామివారి పాదుకలు (ఉద్దాల) తయారు చేస్తరు. వారం పాటు కఠోర ఉపవాస దీక్షలతో, నియమ నిష్ఠలతో వడ్డేమాన్ దళితులు స్వామివారి పాదుకల తయారీలో పాల్గొంటరు. స్వామివారి పాదులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లమర్రి మేదరులు తయారు చేసిన ప్రత్యేక చాటలో వాటిని తిర్మలాపురం చేరుస్తరు. అక్కడి నుండి కురుమూర్తి కొండపై ఉన్న ఉద్దాల మండపంలో భక్తుల దర్శనార్థం వాటిని ఉంచుతరు.
ఉద్దాల మండపంలో దళితులే పూజారులుగా ఉండటం మరో ప్రత్యేకత. స్వామివారి పాదుకలతో వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

కుమ్మరుల కుండ
కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం మట్టికుండ. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు దీనిని తయారుచేస్తరు. ఆ మట్టికుండను ‘తలియకుండ’ మండపంలో ఉంచి, నెల్లి వంశస్థులు పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భారీగా బాణసంచా కాలుస్తరు. డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తరు.

ఈ ఉద్దాల వేడుకను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తరు. ఉద్దాల ఉత్సవం సందర్భంగా అప్పంపల్లి వాగు పరిసరాలు జన సంద్రాన్ని తలపిస్తయి.

బ్రహ్మోత్సవాలు
శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు కొని శు॥ సప్తమి వరకు జరుగుతయి. ఈ సంవత్సరం దీపావళి అనంతరం నవంబర్ మధ్యలో ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి. పాడ్యమి నుండి సప్తమి వరకు వరుసగా మయూర, హంస, గజ, శేష, హయ, హనుమంత, గరుత్మంత వాహనాలపై స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. తెలంగాణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద తిరునాళ్ళ (జాతర)లో కురుమూర్తి కూడా ఒకటి.

శ్రీకురుమూర్తి బ్రహ్మోత్సవాలు గత నవంబర్ 13న అమావాస్యతో ప్రారంభం కాగా, 21వ తేదీదాకా రోజూ వివిధ సేవలను నిర్వహించారు. పుష్పయాగం వంటి కార్యక్షికమాలన్నీ కన్నులపండువగా జరిగాయి. బ్రహ్మోత్సవ కార్యక్షికమాలు నవంబర్ 29న అధికారికంగా ముగిసినా జాతర ఈ నెల 13 (అమావాస్య) దాకా సాగుతుందని ఆలయ అధికారులు చెప్పారు. తర్వాత మరో రెండురోజులూ (ఈ నెల 15 వరకూ) అనేకమంది భక్తులతో కురుమూర్తి క్షేత్రం కోలాహలంగానే ఉంటది.
వ్యాసకర్తల మొబైల్: 94410 59424

ప్రజలు ప్రేక్షకులు కావొద్దు..!

Source: Namaste Telangana.
By: Ghanta Chakrapani
అఖిలపక్ష భేటీకి ముందుగానే పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా చెప్పే విధంగా ఆయా పార్టీలలో ఉన్న తెలంగాణ నేతలు ఒత్తిడి చేయాలి. నిజమే అది నాటకమే కావొచ్చు. కానీ ప్రజలు మాత్రం ప్రేక్షకులుగా మిగిలిపోవద్దు. నాటకం క్లైమాక్స్ మార్చే విధంగా ప్రజలు ఆయా పార్టీల మీద ఒత్తిడి చేయాలి. అందుకు జేఏసీ పూనుకోవాలి. ఈమధ్య తెలంగాణవాదులు సినిమాలు పూర్తయిన తరువాత మాత్రమే ఆందోళన చేస్తున్నారు. కానీ ఈ నాటకం రక్తికట్టాలన్నా, ఆశించిన ముగింపు రావాలన్నా స్క్రిప్ట్ దశలోనే ఒత్తిడి పెంచాలి.

తెలంగాణ విషయంలో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నాటకానికి తెరతీసింది. ఈసారి నాటకంలో తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ప్రాధాన పాత్ర పోషించారు. ఇటీవల చాలాకాలంగా పార్లమెంటు మెట్ల వరకు మాత్రమే పరిమితమైన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సరికొత్త అంకానికి తెరలేపి పార్లమెంటు లోపలికి వెళ్ళగలిగారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల పరిస్థితి చూస్తే కొన్నిసార్లు జాలేస్తుంది. పాపం వాళ్ళు పార్లమెంటులో తమ తమ స్థానాల్లో కూర్చోక ఎంతకాలమయ్యిందో! ఆ బెంగే ఇప్పు డు వాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో తమతమ నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం మీద నిప్పులు చెరగడం, ఢిల్లీకి చేరగానే పార్లమెంటు మెట్ల మీదో, పార్క్‌లోని గాంధీ విగ్రహం ముందో కూలబడిపోవడం వాళ్లకు అలవాటుగా మారిపోయింది. వాళ్ళ అధిష్ఠాన వర్గాని కి కూడా అదే బాగుంది. ప్రతిరోజూ సభలోకి వచ్చి గోల చేయడం కంటే అట్లా సభ బయట ఉండడమే బెటరని వాళ్ళ ఉద్దేశం. అయితే అందుబాటులో ఉండండి అవసరాన్ని బట్టి చేతుపూత్తడానికి మేమే పిలుస్తాం అన్న ధోరణిలోనే ఆ పార్టీ ఉన్నది. నిన్నమొన్నటి వరకు కూడా అలాగే ప్రవర్తించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో పార్లమెంటులో రెండు రోజు ల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. మొదటిరోజు తెలంగాణ ఎంపీలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. మొక్కుబడిగా కేంద్ర మంత్రులు సమావేశానికి పిలిచినా టీ ఎంపీలు వెళ్ళలేదు. రెండోరోజు ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వం కూలిపోకుండా చేతుపూత్తి కాపాడడానికి సంఖ్యా బలం అవసరం కాబట్టి ఎవరు పిలిచారో తెలియదుగానీ కొందరు ఎంపీలు కేంద్ర హోం శాఖా మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసి ఆయన చేత అఖిలపక్షం పేరు తో ఒక పనికి మాలిన ప్రకటన చేయించారు. అప్పటికి అదొక చరివూతాత్మక విజయంగా చెప్పుకున్నారు. తమ ఒత్తిడికి కేంద్రం దిగివచ్చిందని చెప్పుకున్నారు.

కేంద్రం దిగిరావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పదిమంది పార్లమెంటు సభ్యులు అవసరం లేదు. ఉత్తిత్తి బెదిరింపులకు తావులేకుండాఅందరూ ఒక్క తాటిమీద ఉండి ఉంటే స్వయానా సోనియాగాంధీ దిగివచ్చి తెలంగాణ ప్రకటించి ఉండేవారు. కావూరి సాంబశివరావు విషయాన్నే తీసుకోండి, ఆయన మంత్రి పదవి ఇవ్వనందుకు అధిష్ఠానం మీద అలిగి రాజీనామా లేఖ రాస్తే స్వయానా ప్రధాన మంత్రి ఫోన్ చేసి సభకు రావాల్సిందిగా బతిమాలుకున్నారు. వాళ్ళ అవసరం అలాంటిది. కావూరి ఒక్కడు చేసి న పనిని తెలంగాణ ఎంపీల్లో ఏ ఒక్కరూ చేయలేక పోవడమే సమస్య.
తెలంగాణ ఎంపీల సమస్య ఏమిటో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ప్రజల్లో వాళ్ళు పోరాడుతున్నట్టు కనిపించాలి. ఆ పోరాటానికి దిగివచ్చి ప్రభుత్వ మో, పార్టీనో ఏదో ఒక ప్రకటన చేసినట్టు ఉండాలి, అది తమ విజయమని వీళ్ళు మరికొన్ని రోజులు చెప్పుకునే వీలుండాలి. ఈ తంతు గత మూడేళ్ళుగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లో కూడా రాజకీయ నాయకుల పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. రాజకీయ పార్టీలు, నేతలు కేవ లం తమ భవిష్యత్తు కోసమే రాజకీయాలు చేస్తున్నారు తప్ప తెలంగాణ భవిష్యత్తు పట్ల వాళ్లకు ఎలాంటి బెంగా లేదని సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమౌతున్నది.

రాజకీయ పార్టీలు మనుగడ సాధించాలంటే ప్రజలు నిరాశ పడకూడదు, నీరసించకూడదు. వాళ్లకు నిరంతరం ఏదో జరుగుతున్న దృశ్యం కనిపించాలి. కచ్చితంగా ఇపుడు కాకపోయినా 2014లోగా ఏదో ఒకటి జరుగుతుందన్న భ్రమ ఏర్పడాలి. ఇప్పుడు పల్లెబాటల్లో సాగుతున్న పాదయావూతల లక్ష్యం 2014. ఆ లక్ష్యంతోనే తెలంగాణలో ఇప్పుడు చంద్రబాబు యథేచ్ఛగా నడుస్తున్నాడు. నడవడమే కాదు, ఒకప్పుడు పచ్చచొక్కా లు తిరగడానికి సాహసించని ఈ ప్రాంతంలో తనకిక తిరుగేలేదని నమ్ముతున్నాడు. ఇప్పటిదాకా తెలంగాణ రావాలని కోరుకుంటున్న తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు వస్తుందో లేదోనన్న అయోమయంలో ఉన్నవాళ్ళు బాబు వచ్చేసరికి ఆయన వెంట నడుస్తున్నారు. నిజానికి ఆయన వెంట తెలంగాణ వాళ్ళెవరూ నడవాల్సిన పనిలేదు. నిజామాబాద్ జిల్లానుంచి ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఆయన వెంట నిరంతరం ఐదువందలమంది ఉంటున్నారు. వాళ్ళంతా పాదయాత్ర మొదలయినప్పటి నుంచి ఆయన వెంటే వస్తున్నారు. దీనికితోడు ఆయన రక్షణలో ఉన్న పోలీసులు, పారామిలటరీ దళాలు, మధ్యమధ్యలో వచ్చి బంధు మిత్ర వర్గాలు ఆయన కదలికే ఒక మహాయావూతగా మారిపోతోంది.

ఆయన ఏ ఊరి కూడలిలో ఆగినా అదే ఒక పెద్ద బహిరంగ సభ అయి గోచరిస్తున్నది. వాళ్ళందరికీ వండి వార్చడానికి బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ముప్ఫై మూడుమంది వంటవాళ్లు రేయింబవళ్ళు కష్టపడుతున్నారని ఆ పత్రిక రాసింది. మరోవైపు జగనన్న వదిలిన బాణం కూడా వాయువేగంతో దూసుకు వస్తోంది. అది పెద్ద తుపాను సృష్టించలేకపోతున్నా తెలంగాణ గడ్డమీద వారికొక రూట్‌మ్యాప్ కోసం ఉపయోగపడుతున్నది. ఆమె వెంట ఉన్న వాళ్ళు అడ్డొచ్చిన వారినల్లా చావబాదుతూ సాగిపోతున్నారు. వారి చేతుల్లో ఆమెను ప్రతిఘటించిన పాపానికి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు చావు దెబ్బలు తిన్నారు. బయటకు పెద్దగా కనిపించకపోయినా తెలంగాణలో జగన్ సామాజిక వర్గం, రాజశేఖర్‌డ్డి రాజకీయ వర్గం లోపాయికారిగా ఆమెకు సహకరిస్తున్నది. ఆలస్యంగానైనా తెలంగాణ రాష్ట్ర సమితి పల్లె బాట పట్టింది.
ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కలవర పెట్టే పరిణామాలే! ఆ పార్టీ కి ఇప్పటికే ఇక్కడ నూకలు చెల్లాయని, 2014 దాటితే తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, ఇతర నేతలకు ఇప్పటికే అర్థమయ్యింది. కొందరు ఇప్పటికే పెట్టే బేడాసర్దుకున్నారని కూడావార్తలందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తెలంగాణలో ఫ్రంట్ కట్టడమా, ఎప్పట్లాగే ఎన్నికలదాకా ఇలాగే తెర ఉండడమా అన్నది అర్థం కాని అయోమయంలో ఉన్న ఈ దశలో కాంగ్రెస్ అధిష్ఠానం మళ్ళీ ఇప్పుడు అఖిలపక్షం పేరుతో కొత్త అంకానికి తెరలేపింది. ఇప్పుడు ఆ పేరుమీద మరో నెలపాటు, ఏకాభివూపాయం కుదరకపోతే 2014 వరకూ ఈ నాటకాన్ని ఇలాగే కొనసాగించే వెసులుబాటు వారికి లభిస్తుంది.

ఇంతకీ అఖిలపక్షం కావాలని చంద్రబాబు మినహా తెలంగాణవాదులు ఎవరు కోరా రు? అఖిలపక్షం ఏరకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తుంది. ఆగిపోయి ఉన్న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ మొదటికి రావడం వెనుక కారణాలేమిటి అన్నవి సామాన్య ప్రజలకే కాదు రాజ్యాంగ నిపుణులకు కూడాఅంతుచిక్కని విషయాలు. ఇది తెలంగాణ ప్రజల్ని మోసగించేదిగానే కాదు భారత రాజ్యంగా స్ఫూర్తికి విరుద్ధంగా కూడా ఉంది. ఒక రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే హక్కు కేవలం భారత పార్లమెంటుకే ఉండాలని రాజ్యాంగం స్పష్టంగా చెపుతోంది. అంతేకాదు రాష్ట్ర విభజన విషయంలో ఇప్పుడున్న సమైక్య రాష్ట్రానికి గానీ, ఆ రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు గానీ ఎటువంటి అధికారం ఉండడానికి వీలులేదని రాజ్యాంగ రచన సందర్భంగా జరిగిన చర్చ స్పష్ట పరిచింది. రాజ్యాంగ రచనా సంఘంలో ఆర్టికల్ మూడు పొందుపరిచేటప్పుడు జరిగిన చర్చలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని లేవనేత్తినప్పుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దీనిపై సమగ్ర విశ్లేషణ చేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అన్యాయానికి, దోపిడీకి గురైనవాళ్ళు, ఆ రాష్ట్రంలో రాజకీయంగా ఆధిపత్యం ఉన్న ప్రాంతం వారి చేతిలో మోసపోతున్న వాళ్ళు, నష్టపోతున్నవాళ్ళే కొత్త రాష్ట్రం కావాలని కోరుకుంటారు. అలాంటప్పుడు రాష్ట్రం ఏర్పాటు చేయాలా వద్దా అని ఆ ఆధిపత్య వర్గాలనే అడగడం అన్యా యం అవుతుందని అంబేడ్కర్ వాదించారు.

అందుకే రాష్ట్ర విభజనను రాష్ట్ర శాసనసభ ఆమోదించాలని గానీ, ఆ రాష్ట్ర ప్రజలందరి అంగీకారం ఉండాలనిగానీ లేదు. అది కేవలం పార్లమెంటు కు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన హక్కు. కేంద్ర కేబినేట్ తీసుకోవలసిన రాజ్యాంగ నిర్ణయం. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చింది. తమకు కావాల్సిన బిల్లులు, నిర్ణయాలను అన్నిరకాల అనైతిక మార్గాలద్వారా ఆమోదింపజేసుకుంటూ కాలం గడిపేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో అఖిల పక్షాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకోవాలనడం రాజ్యాంగ ధర్మానికి విరుద్ధం. ఇదంతా ఒక రాజకీయం. ఇది కేవలం పాదయావూతికులను కట్టడి చేయడానికి ఉపయోగపడుతుందేమో తప్ప పరిష్కారం చూపే మార్గం మాత్రం కాదు. అలాగే ఇది ఒక దుస్సాంవూపదాయం కూడా. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటు విషయంలో 2009 డిసెంబర్ ఏడున ఒక అఖిలపక్షం జరిగింది. అందులో తెలంగాణ వెంటనే ఏర్పాటు చేయాలన్న తీర్మానం ఏకక్షిగీవ ఆమోదం పొందింది. ఆ తరువాత ఢిల్లీలో మరోసారి అఖిలపక్షం కలిసింది. అదికూడా శాంతియుత వాతావరణం ఏర్పడాలని భావించిందే తప్ప పాత తీర్మానాన్ని రద్దు చేయలేదు. ఆ తరువాత కమిటీలు, నివేదికలు అన్నీ జరిగాయి. వాటి ఆధారంగానైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో పచ్చి సమైక్యవాదులు కూడా ప్రశాంతంగా పాదయావూతలు చేస్తున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రక్షికియ పూర్తిచేయడమే తప్ప కొత్త నాటకాలు కాదు.

అయినా సరే నాటకాలు నడవనియ్యాలి. రోజుకో రంగుమార్చి, కొత్తకొత్త వేషాలతో నేతలు ప్రజల్లోకి వస్తున్నప్పుడు వారి అసలు రూపం ఏమి టో తెలియాలి. కొన్నిసార్లు నాటకాల్లోని ఎత్తుగడలు కూడా ఉత్కం రేపుతుంటాయి. కొన్ని ఘట్టాలు ముగింపు పలుకుతాయి. బహుశా ఈ అఖిలపక్షం కూడాఅదే పని చేయవచ్చు. ఇది తెలంగాణకు చరమాంకం కావొ చ్చు. కావాలి కూడా. ఇంతకాలం వ్యతిరేకం కాదు అంటూ కాలక్షేపం చేస్తు న్న తెలుగుదేశంపార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వంటి పార్టీల అసలు రంగు బయటపెట్టడానికి ఇది దోహదపడవచ్చు. అయితే ఈ సారి అఖిలపక్ష విధి విధానాలు కూడా స్పష్టంగా ఉండాల్సి ఉంటుంది. కచ్చితంగా ఒక్కొక్క పార్టీ నుంచి, ఒక్కొక్క ప్రతినిధి మాత్రమే చర్చలకు రావాలని, వీలైతే పార్టీ అధ్యక్ల్షుడు గానీ, ఆయన అధికారిక లేఖతో ప్రతినిధి గానీ హాజరవ్వాలని స్పష్టం గా కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించాలి. సమావేశంలో పార్టీల నిర్ణయాలు చెప్పాలే తప్ప వ్యక్తిగత అభివూపాయాలకు తావు ఉండకూడదు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలి. అలాగే కాంగ్రెస్‌పార్టీ కూడాతన అభివూపాయం ఏమిటో ముందే చెప్పాలి.

ఒకానొక చర్చ సందర్భంగా తెలుగు దేశం నేతలు జేఏసీకి చేతనైతే కేంద్రవూపభుత్వం మీద ఒత్తిడి తెచ్చి చంద్రబాబు తెలంగాణలో పాదయావూతలో ఉన్నప్పుడే అఖిలపక్షం పెట్టేవిధంగా ప్రయత్నించాలని, అలాగైతే ఆయన పాద యాత్ర నిలిపేసి ఢిల్లీ వెళ్లి చర్చలకు హాజరయ్యే విధంగా తాము ఒప్పిస్తామని నాతో అన్నారు. నిజంగానే వారికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధిగానీ, భవిష్యత్తులో రాజకీయాల పట్ల ఆశగానీ ఉంటే ఆ పని చేసి చూపించాలి.అలాగే జగన్ వెంట ఉన్నవాళ్ళు, షర్మిలను నీడలా వెంబడిస్తున్న వాళ్ళు కూడా అవసరమైతే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు జైలు నుంచి జగన్ వెళ్ళే విధంగా న్యాయపరమైన అనుమతులు కోరాలి. అది వీలు కానప్పుడు వై.ఎస్. విజయమ్మ అందుకు సిద్ధపడాలి. పార్టీలు ముందుగానే తమ వైఖరిని స్పష్టంగా చెప్పే విధంగా ఆయా పార్టీలలో ఉన్న తెలంగాణ నేతలు ఒత్తిడి చేయాలి. నిజమే అది నాటకమే కావొచ్చు. కానీ ప్రజలు మాత్రం ప్రేక్షకులుగా మిగిలిపోవద్దు. నాటకం క్లైమాక్స్ మార్చే విధంగా ప్రజలు ఆయా పార్టీ ల మీద ఒత్తిడి చేయాలి. అందుకు జేఏసీ పూనుకోవాలి. ఈమధ్య తెలంగాణవాదులు సినిమాలు పూర్తయిన తరువాత మాత్రమే ఆందోళన చేస్తున్నారు. కానీ ఈ నాటకం రక్తికట్టాలన్నా, ఆశించిన ముగింపు రావాలన్నా స్క్రిప్ట్ దశలోనే ఒత్తిడి పెంచాలి. ఇప్పుడు అన్ని పార్టీలు మళ్ళీ పాత కథలకే బూజు దులిపే ప్రమాదం ఉంది. అది అడ్డుకునే విధంగా ఒత్తిడి పెంచాలి. ఆ ఒత్తిడికి పాదయావూతికులు ఒకే ఎజెండాతో ఢిల్లీ బాట పట్టాలి.
పొఫెసర్ ఘంటా చక్రపాణి

Wednesday, May 9, 2012

బాబుది దండయాత్రే అనుమతించం

-బాబుకు కిరణ్ సహకారం
- అందుకే భారీ ఎత్తున బలగాలు
- 3 వేల మంది జైళ్లలో ఉన్నారు
- నేడు జిల్లా బంద్ విజయవంతం చేయండి
- నిరసనలు మా హక్కు
- ఈ ప్రాంతంలో సమైక్యవాద కార్యక్షికమాలొద్దు
- జగన్‌కూ మినహాయింపు లేదు: కోదండరాం

kodanda-rom- talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 5, (టీ న్యూస్): తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరి ప్రకటించనంత వరకు వరంగల్ జిల్లాలో ఆయన పర్యటనను అడ్డుకుంటామని, ఎట్టిపరిస్థితిలోనూ ఆయన పర్యటనను అనుమతించేది లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణపై బాబు వైఖరి స్పష్టం కావాల్సిందేనని అన్నారు. గురువారం జేఏసీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి, జేఏసీ కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్, జేఏసీ నాయకులు అద్దంకి దయాకర్, ఎం.సత్యం, కత్తి వెంకటస్వామి తదితరులతో కలసి కోదండరాం మాట్లాడారు. రైతు యాత్ర ముసుగులో తెలంగాణ ప్రజలపై బాబు దండయాత్ర చేస్తున్నారని కోదండరాం ధ్వజమెత్తారు. బాబుతో కుమ్మక్కైన సీఎం కిరణ్‌కుమార్‌డ్డి తెలంగాణ జిల్లాల పర్యటనకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తోందని ఆరోపించారు. బాబు కోసం వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేసి ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఎలాంటి కారణాలు లేకుండానే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని, ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో 3,000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిరసన తెలిపే ప్రజల హక్కును పాలకులు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నిరసన కార్యక్షికమాలను చేపడుతూనే ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంతటి దాడులనైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని కోదండరాం అన్నారు. ఏ పార్టీతో సంబంధం లేని రైతు ఫణికర మల్లయ్యను సైతం అరెస్టు చేశారని, ఎమ్మెల్యేలనూ అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.